
కోహెడ(హుస్నాబాద్): చనిపోయిన తమ్ముడి విగ్రహానికి అక్కలు రాఖీ కట్టి తమ ఆత్మీయ బంధాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దుబ్బతండా పరిధి రాజు తండాకు చెందిన గుగులోతు లింగయ్య, -వీరమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు నరసింహ నాయక్ ఉన్నారు. సీఆర్పీఎఫ్జవాన్గా నరసింహనాయక్ విధులు నిర్వహిస్తూ 2014లో చత్తీస్గఢ్ లో మావోయిస్టుల మందుపాతర పేలుడులో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్ద అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రాఖీ పండుగ రోజున తమ్ముడి విగ్రహానికి ముగ్గురు అక్కలు రాఖీ కడుతూ తమ్ముడిపై తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు.