విచారణకు రావాల్సిన అవసరం లేదు.. రఘురామకు సిట్ ఈ మెయిల్

విచారణకు రావాల్సిన అవసరం లేదు.. రఘురామకు సిట్ ఈ మెయిల్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇవాళ సిట్ విచారణకు హాజరుకావడం లేదు. ప్రస్తుతానికి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ రఘురామకు సిట్ ఈ మెయిల్ పంపింది. మళ్లీ అవసరం అయితే పిలుస్తామంటూ సిట్ తెలిపింది. నిజానికి రఘురామకు 3 రోజుల క్రితం సిట్ CRPC 41A కింద నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10.30నిమిషాలకి కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించింది.

నిందితులతో రఘురామ కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితులైన A1, A2 లతో.. ఎంపీ రఘురామకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే 41A నోటీసులు అందుకున్న నలుగురిని నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని సిట్ తెలిపింది. ఇప్పటికే విచారణకు హాజరుకాని.. ఇద్దరికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కానీ ఇవాళ రఘురామ విచారణకు అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు.