ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అంశంపై సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి రోజా.. చంద్రబాబు పాపాలు పండాయన్నారు. ఆయన చేసిన తప్పులకు స్టే లు తెచ్చుకుంటూ ఇన్నాళ్ళూ బతికాడని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్ళి చిప్పకూడు తినే రోజులు వచ్చాయని అన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు దగ్గర నుండి కోట్లు దోచుకున్నాడంటూ.. అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొని ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని విమర్శించారు. సిట్ విచారణలో అందరూ లెక్కలు బయట వస్తాయన్నారు. లోకేష్, చంద్రబాబు సూట్ కేసుల్లోని డబ్బుల లెక్కలు బయటకు వస్తాయన్నారు. వందశాతం అందరూ జైలుకు వెళతారని మంత్రి రోజా అన్నారు.