
TSPSC పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ బృందం పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్దమౌవుతోంది. న్యాయపరమైన సలహాలు తీసుకుని రేవంత్ పై చర్యలు తీసుకునేందుకు సిట్ రెడీ అవుతోంది. ఒకే మండలంలో 100 మంది పాస్ అయినట్టుగా రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మార్చి 23న విచారణకు హాజరైన రేవంత్ తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు సమర్పించారు. రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ రికార్డు చేసింది. ఇక ఈ కేసులో సిట్ అధికారులు 13 మందిని ఆరెస్ట్ చేశారు.