
ఖైరతాబాద్,వెలుగు: భువనగిరిలోని ప్రభుత్వ హాస్టల్ లో చదివే టెన్త్ విద్యార్థులు భవ్య,వైష్ణవిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, హాస్టల్ వార్డెన్శైలజ, ఆటో డ్రైవర్ఆంజనేయులు, వంటమనిషి సుజాత, పీఈటీ ప్రతిభ పై ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు వాసు కె. యాదవ్మాట్లాడుతూ ఇందిరాపార్క్వద్ద ధర్నా చేపడతామని దోమలగూడ పోలీసులను అనుమతి కోరితే ఇస్తామన్నారని పేర్కొన్నారు. దీంతో ధర్నా చేసేందుకు వస్తే అరెస్టు చేసినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దోమల్గూడ సీఐ శ్రీనివాస్రెడ్డి తనను దూషించి దుర్బాషలాడారని, ఆయన నుంచి తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. హాస్టల్ లో చదివే తమ బిడ్డలను చంపి ఆత్మహత్యలుగా చిత్రీకరించారని ఆరోపించారు. హత్యలు వెనుక పెద్దల హస్తం ఉందని, సిటింగ్జడ్జితో విచారణ చేయించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాన్కుమార్, రోజా నేత, అభినవ్,భవ్య తండ్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.