పిట్లం, వెలుగు: పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని కోరుతూ బుధవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే ఇంటిముట్టడి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టగా, బీజేవైఎం మండల ప్రెసిడెంట్ శెట్పల్లి విష్ణు, కార్యకర్తలు సంజీవ్ పాటిల్, జాదవ్పండరి నాయక్, గంగాధర్, గోపాల్చారి, శివాజీ పటేల్, పీరాజీ, రమేశ్తదితరులకు గాయాలయ్యాయి.
వీరిని స్థానిక గవర్నమెంట్హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్అందించారు. శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేండ్లలో పక్క నియోజకవర్గంలో వేల ఇండ్లు కట్టారని, జుక్కల్నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించడానికే ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నిస్తే, దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. పోలీసులు కేవలం బీజేపీ కార్యకర్తలపైనే లాఠీచార్జి చేశారని ఆరోపించారు.
కామారెడ్డి టౌన్: గత ఎన్నికల టైమ్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ఆఫీసును బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. ర్యాలీగా క్యాంప్ఆఫీస్వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, మెయిన్రోడ్పై బారీ కేడ్లు పెట్టి పోలీసులు అడ్డగించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్చేశారు. మున్సిపల్ ఫ్లోర్లీడర్శ్రీకాంత్, టౌన్ప్రెసిడెంట్ విఫుల్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ: బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి మల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. అసెంబ్లీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.