కొత్తవాళ్లతో ఆట మొదలుపెట్టిన బిగ్ బాస్.. రచ్చ మొదలైంది

కొత్తవాళ్లతో ఆట మొదలుపెట్టిన బిగ్ బాస్.. రచ్చ మొదలైంది

బిగ్‌బాస్‌ సీజన్ 7(Bigg boss season7)లో కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంటినుండి ఐదుగురు బయటికి వెళ్లిపోయారు.. ఇక మిగిలింది మేమె అనుకున్న కంటెస్టెంట్స్ కు మరో పెద్ద టాస్క్ ఉందంటూ చెప్పి మైండ్ బ్లాక్ చేశాడు. ఇందులో భాగంగానే మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించాడు. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ట్విస్టుకి హౌస్ మేట్స్ దిమ్మతిరిగిపోయింది. వీరితో కూడా ఆట ఆడి గెలవాలని ఛాలెంజ్‌ ఇచ్చాడు. 

ఇక హౌస్ లోకి వచ్చిన కొత్త కంటెస్టెంట్స్ తో కూడా ఆట మొదలుపెట్టేశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా.. కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లను పోటుగాళ్లగా.. ఇప్పటికే హౌస్‌లో ఉన్నవారిని ఆటగాళ్లుగా విభజించాడు. ఇక సోమవారం అనగానే అందరికీ గుర్తొచ్చేది నామినేషన్స్  కదా.. తాజాగా దీనికి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశాడు బిగ్ బాస్. 

అయితే ఇందులో మరో మెలిక పెట్టాడు బిగ్ బాస్ అదేంటంటే.. ఆరవ వారం నామినేషన్ లో నామినేట్ చేసే అవకాశం కేవలం కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్ పోటుగాళ్లు మాత్రమే ఇచ్చాడు బిగ్ బాస్. ఈ చిన్న లాజిక్ తో కొత్త, పాత కంటెస్టెంట్స్ మధ్య వార్ డిసైడ్ చేశాడు. ఇక నామినేట్ చేయడానికి వచ్చిన కొత్త కంటెస్టెంట్స్ ఇచ్చిన కారణాలతో పాత కంటెస్టెంట్స్ కాస్త ఇబ్బంది పడ్డారు. రీజన్ కరెక్ట్ గా లేవంటూ మండిపడ్డారు. మేము ముందునుండి ఇక్కడ ఉన్నాం.. ఇక్కడి పరిస్థితులు మాకు మాత్రమే తెలుసు అంటూ మండిపడ్డారు. ఇక పూర్తి నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందో తెలియాలంటే మాత్రం ఇవాళ్టి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.