రాజస్థాన్ లక్ష్యం 151 పరుగులు

రాజస్థాన్ లక్ష్యం 151 పరుగులు

ఐపీఎల్ 2022 చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్కు 151 లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సీఎస్కే..20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు విఫలం కాగా..ఫస్ట్ డౌన్లో వచ్చిన మొయిన్ అలీ సూపర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు.

అయితే సెంచరీకి చేరువైన మొయిన్ అలీని మెక్కాయ్ పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు, జగదీషన్ వెంటవెంటనే  ఔటయ్యారు. చివర్లో కెప్టెన్ ధోని 26 పరుగులు చేయడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, మెక్కాయ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా..బౌల్ట్, అశ్విన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.