ఇంటర్నేషనల్​ చెస్​ టోర్నీలో గిరిజన విద్యార్ధిని ప్రతిభ

ఇంటర్నేషనల్​ చెస్​ టోర్నీలో గిరిజన విద్యార్ధిని ప్రతిభ

భద్రాచలం, వెలుగు : హైదరాబాద్‌లో ఈ నెల 25  నుంచి 27వ తేదీ వరకు జరిగిన స్లాన్ ఫస్ట్ ఇంటర్నేషనల్​ చెస్ టోర్నమెంట్​-లో జిల్లాకు చెందిన బానోత్ ధనుశ్రీ 15 సంవత్సరాల విభాగంలో థర్డ్ ప్లేస్ సాధించింది.  ధనుశ్రీ  భద్రాచలం గిరిజన గురుకులం కాలేజ్​ ఆఫ్​ ఎక్స్ లెన్స్​లో ఎంపీపీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.  

రూ.8 వేల నగదు, మెరిట్​ సర్టిఫికెట్, ట్రోఫీ  కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్​ స్థాయి టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన ధనుశ్రీని ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్​, గురుకులాల ఆర్సీవో డేవిడ్​రాజ్‌లు అభినందించారు.