ప్రాజెక్టు కాలువలను పరిశీలించిన స్మిత సబర్వాల్

ప్రాజెక్టు కాలువలను పరిశీలించిన స్మిత సబర్వాల్

కొమురంభీం జిల్లా:  వాంకిడి మండలం చిన్న వాంకిడి వద్ద కొమురం భీం ప్రాజెక్టు కాలువలను సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ పరిశీలించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో వచ్చిన ఆమె అధికారులను వెంట పెట్టుకుని కుమ్రంభీం ప్రాజెక్టు కాలువలను సందర్వించారు. కాలువల్లో మొలసిన పిచ్చి చెట్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్, పర్యవేక్షిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ ఏప్రిల్ 25వ తేదీ.. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ మండలం పర్శనంబల దగ్గర వట్టివాగు ప్రాజెక్టును పరిశీలించారు స్మితా సబర్వాల్. సీఎంవో అధికారిణి ప్రాజెక్టుల సందర్శనకు హెలికాఫ్టర్ లో రావడం చర్చనీయాంశం అయింది. 

 

 

ఇవి కూడా చదవండి

పాండవులగుట్టకు యునెస్కో గుర్తింపు కోసం కృషి 

స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్

డబుల్ బెడ్రూం ఇళ్లపై 2 నెలల్లో నివేదిక ఇవ్వండి