కృష్ణా ఎక్స్ ప్రెస్లో పొగలు...భయంతో ప్రయాణికుల పరుగు

కృష్ణా ఎక్స్ ప్రెస్లో పొగలు...భయంతో ప్రయాణికుల పరుగు

ఈ మధ్య కాలంలో రైళ్లు అగ్నిప్రమాదాల బారిన పడుతున్నాయి. దీంతో  ప్రయాణికులు ట్రైన్ జర్నీ అంటేనే భయం పుట్టే పరిస్థితి నెలకొంది. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే కృష్ణా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి  ఆదిలాబాద్ వస్తున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగారు. 

పరుగో పరుగు..

కృష్ణా ఎక్స్ ప్రెస్ లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ట్రైన్ లో మంటలు అంటుకుంటున్నాయా అని తెగ ఆందోళన చెందారు. చైన్ లాగడంతో ట్రైన్ ఆగిన వెంటనే పరిగెత్తారు.  దీంతో రైలు నెల్లూరు జిల్లాలోని  వెంకటగిరి  రైల్వే స్టేషన్ లో నిలిచిపోయింది.  సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది..పొగలు రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.