కురవి, వెలుగు : హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో బుధవారం పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో దిగి పరుగులు తీశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. హైదారాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్సమీపంలోకి చేరుకోగానే బ్రేక్ లైనర్స్ పట్టేశాయి.
దీంతో రైలులోని అన్ని బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో దిగి పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై బ్రేక్ లైనర్స్ పట్టేయడం వల్లే పొగలు వ్యాపించాయని, ఏమీ కాదని ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. అరగంట పాటు ట్రైన్ ను అక్కడే నిలిపేసి రిపేర్లు పూర్తయ్యాక వెళ్లిపోయారు.