ఒడిశా-ఆంధ్ర సరిహద్దు నుండి హైదరాబాద్ కు గంజాయి

ఒడిశా-ఆంధ్ర సరిహద్దు నుండి హైదరాబాద్ కు గంజాయి

సూర్యాపేట: ఒడిశా- ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 7.5 లక్షల విలువైన 1.5 లీటర్ల గంజాయి ఆయిల్ ( హాశిష్ ఆయిల్ ) పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు. జిల్లా సీసీఎస్ పోలీసులు, కోదాడ పోలీసులు ఉమ్మడిగా కలసి గంజాయి ఆయిల్ రవాణా గుట్టు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 వేల నగదు , 5 మొబైల్స్ , ఒక కమాండర్ జీప్ ,  1.5 లీటర్ల హాశిష్ ఓ8 స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు కొద్ది రోజుల క్రితం గంజాయి స్మగ్లర్లను వెంటాడుతూ విశాఖ జిల్లాకు వెళ్లి మరీ దాడులు చేసినా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు ఘటన రుజువు చేసింది.