
వాటర్ ఫాల్స్.. జలపాతాలు వీటి దగ్గరకు వెళ్లిన పర్యాటకులు వాటర్ లో ఎంజాయి చేస్తారు. ఓ జలపాతంలో పర్యాటకులు కుషీగా టైం స్పెండ్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా అలజడి రేగింది.. ఇక అంతే జనాలు చెల్లచెదురుగా ఒడ్డుకు చేరుకున్నారు.. ఇంతకూ ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్ ... ముస్సోరిలోని కెంప్టీ జలపాతంలో పాము షికారుకు వచ్చింది. అప్పటికే వందలాది మంది పర్యాటకులు స్నానం చేస్తున్నారు. దీంతో అక్కడున్న పర్యాటకులంతా బెంబేలెత్తిపోయారు. భయంతో పాము నుంచి తప్పించుకునేందుకు పక్కకు దూకారు. ప్రజలు ఏదో విధంగా తప్పించుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
జూన్ 14వ తేదీన కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గర ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. జలపాతంలోని చల్లటి నీటిలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకుల మధ్యలోకి అనుకోని అతిథిలాగా ఓ పాము దూసుకొచ్చింది. దీంతో పర్యాటకులు ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. కొంతమంది నీటిలో నుంచే బయటకు దూకారు. పాము మాత్రం తన దారిలో నిశ్శబ్దంగా వెళ్లిపోయింది.
ఈ సంఘటనను ఓ పర్యాటకుడు సోషల్ మీడియాలో @littledehradunstories అనే Instagram లో పోస్ట్ చేశారు. ఇక అంతే అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పటికి ( వార్త రాసే సమయానికి) 8 లక్షలకు పైటా వ్యూస్ వయచ్చాయి. నెటిజన్లు అనేక రకాలుగా స్పందించారు. పాపుల మధ్య నేను ఎందుకు అనుకుంటూ పాము వెళ్లిందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇది మనుషుల దాడి.... పాము కాదు. అందరూ సురక్షితంగా ఉండండి ..అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు పాములనుంచి మనం చాలా నేర్చుకోవాలి... భయపడి ఎవరికి హాని చేయకుండా వెళ్లిపోయింది. అదే మానవులైతే అలా ప్రవర్తించరు కదా.. అని రాశారు. నాలుగో యూజర్ మీరను ఇంట్లోనే ఉండండి.. పర్వతాలు పిలవడం లేదుకదా.. అక్కడకు ఎందుకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. పాముకి చాలా బాధాకరమైన అనుభవం ఎదురైందని మరొకరు కామెంట్ చేశారు.