సంజయ్ కిషోర్ రాసిన ‘స్వాతంత్రోద్యమం- తెలుగు సినిమా ప్రముఖులు’ పుస్తకావిష్కరణ శనివారం హైదరాబాద్లో జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుక్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ ‘తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉన్నది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్ కిశోర్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించి చక్కటి విశ్లేషణ చేశాడు.
ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఇలాంటి మంచి పుస్తకాన్ని వీడియో రూపంలో కూడా తీసుకురావాలని సంజయ్ కిశోర్ని కోరుతున్నా’ అన్నారు. సంజయ్ కిశోర్, కె.వి.రమణాచారి, తమ్మారెడ్డి భరద్వాజ, మండలి బుద్ధ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.