గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్రగ్స్ దందా

 గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్రగ్స్ దందా

గచ్చిబౌలి, వెలుగు :  సాఫ్ట్​వేర్​ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్​అమ్ముతున్న ఐటీ ఎంప్లాయ్​ని మాదాపూర్​ఎస్​ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్​ చేశారు. 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ముత్యాల సాయికిరణ్(28) గౌలిదొడ్డి కేశవనగర్ లోని నెస్ట్ ఇన్ హోమ్స్ లో ఉంటూ టెక్నికల్​సపోర్ట్​గా పని చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ నుంచి ఎండీఎంఏ కొని అమ్మాలని చూశాడు. దీంతో పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.