
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఏరియా త్రీ ఇంక్లైన్ ప్రాంతంలో రూ.37 లక్షలతో నిర్మించిన సోలార్ మోడల్ హౌస్ను సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. సింగరేణిలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్లకు సంబంధించి సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసేందుకే మోడల్హౌస్ నిర్మించామని తెలిపారు. ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు, సోలార్ ఎనర్జీ జీఎం జానకీ రామ్, వర్క్షాప్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ జీఎం జేసురత్నం తదితరులు పాల్గొన్నారు.