కొత్తగూడెం ఏరియా త్రీ ఇంక్లైన్ ప్రాంతంలో సోలార్ మోడల్ హౌస్ ప్రారంభం

కొత్తగూడెం ఏరియా త్రీ ఇంక్లైన్ ప్రాంతంలో సోలార్ మోడల్ హౌస్ ప్రారంభం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఏరియా త్రీ ఇంక్లైన్ ​ప్రాంతంలో రూ.37 లక్షలతో నిర్మించిన సోలార్​ మోడల్​ హౌస్​ను సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. సింగరేణిలో ఏర్పాటు చేస్తున్న సోలార్​ ప్లాంట్లకు సంబంధించి సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్​ చేసేందుకే మోడల్​హౌస్​ నిర్మించామని తెలిపారు. ఏరియా జనరల్​ మేనేజర్​ షాలెం రాజు, సోలార్​ ఎనర్జీ జీఎం జానకీ రామ్, వర్క్​షాప్ అండ్​ ఎనర్జీ మేనేజ్​మెంట్ జీఎం  జేసురత్నం తదితరులు పాల్గొన్నారు.