పాత కొత్తగూడెంలో రాత్రికి రాత్రే సర్కార్​ ల్యాండ్​ కబ్జా

పాత కొత్తగూడెంలో రాత్రికి రాత్రే సర్కార్​ ల్యాండ్​ కబ్జా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలోని పాత కొత్తగూడెంలో దాదాపు రూ. 2కోట్ల కు పైగా విలువైన దాదాపు 2వేల గజాల గవర్నమెంట్ ల్యాండ్​ను కొందరు బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు, నేతలు ఆక్రమించుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్​లో శుక్రవారం రాత్రికి రాత్రే కంపౌండ్ వాల్​ నిర్మించారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు  గతంలో  దాదాపు 30 ఎకరాల ల్యాండ్​ను సేకరించి చుట్టూ కాంపౌండ్​ వాల్​ కట్టారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న  బీఆర్​ఎస్ కు ప్రజాప్రతినిధులు  ఎవరూ గుర్తు పట్టకుండ ప్రస్తుతం ఉన్న కాంపౌండ్​ వాల్​మాదిరిగా మరో కాంపౌండ్​ వాల్​ నిర్మాణం చేపట్టారు.  స్థానికులు తహసీల్దార్​ పుల్లయ్య దృష్టికి శనివారం తీసుకెళ్లారు. దీంతో ఆయన అక్కడికి వెళ్లి కాంపౌండ్​ వాల్​ను  కూల్చివేయించారు. ఆక్రమించుకున్న వారి వివరాలను సేకరించాలని సిబ్బందిని   ఆదేశించారు.