యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి సంబంధించిన ‘అదిరింది’ అనే మెలోడియస్ వీడియో సాంగ్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో నితిన్, కృతి శెట్టి డ్యాన్స్ మూవ్మెంట్స్ అలరిస్తున్నాయి. కాగా ఈ పాటను సంజిత్ హెగ్డే ఆలపించాడు. వరుస అప్ డేట్ ఇస్తూ చిత్ర నిర్వాహకులు ఈ మూవీపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘రా రా రెడ్డి’ లిరికల్ సాంగ్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.