26న రాష్ట్రాల ఇంఛార్జులతో సోనియా గాంధీ భేటీ

26న రాష్ట్రాల ఇంఛార్జులతో సోనియా గాంధీ భేటీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాల్లో పడింది కాంగ్రెస్ హైకమాండ్. ఒకవైపు ఓటమి.. మరోవైపు రెబెల్ నేతల ఒత్తిడితో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 26న పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జులతో సోనియాగాంధీ సమావేశం కానున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ కీలక భేటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షత వహించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ పురోగతి, మోడీ సర్కారుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై సోనియా.. పార్టీ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే జీ 23 అసమ్మతి నేతలతోనూ సోనియా గాంధీ నిరంతంరం సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రక్షాళనపై రెబెల్ నేతల సూచనలు స్వీకరిస్తున్నారు.  పార్టీలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టేందుకు సంస్థాగత ఎన్నికల వరకు వేచి చూడాలని సోనియా వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.