కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ గా సోనియా

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ గా సోనియా

ఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ …. సోనియా పేరును ప్రతిపాదించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లలో మాత్రం గెలిచింది. ప్రతిపక్ష హోదా దక్కాలన్నా ఆ పార్టీకి మరో మూడు సీట్లు తక్కువే ఉన్నాయి. కాంగ్రెస్ పార్ల మెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా ఎన్నికైన వారే… పార్లమెంట్ లో పార్టీ నేతను ఎన్నకుంటారు. గత లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా మల్లిఖార్జున్ ఖర్గే కొనసాగారు. అయితే ఖర్గే కర్నాటకలోని గుల్బ్ ర్గా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలిపారు సోనియా గాంధీ.

రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్ గాంధీ. పార్టమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన రాహుల్…..కాంగ్రెస్ వర్కర్లుకు, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. విశ్వాసాలకు, వర్ణాలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలన్నారు. ప్రతి రోజు బీజేపీపై పోరు కొనసాగుతుందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత సుర్జేవాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు.