ఉక్రెయిన్, రష్యా మధ్య మొదలైన యుద్ధం అందరినీ ఆందోళనకుగురి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపులు ఈ యుద్ధంపైనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ యుద్ధం గురించి కలవరపడుతున్నారు. ఈ సమయంలో.. ఉక్రెయిన్లో ఇంకా కొంతమంది భారతీయులు చిక్కుకోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వీరి విషయంపై బాలీవుడ్ నటుడు, సామాజికవేత్త సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోనూ సూద్ ట్వీట్టర్ ట్వీట్ చేశారు. “18000 మంది భారతీయ విద్యార్థులు .. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన అనేక కుటుంబాలు, వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రజలను రక్షించడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనవలసిందిగా భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు... వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు సోనూ సూద్ .
There are 18000 Indian students and many families who are struck in Ukraine, I am sure Government must be trying their best to get them back. I urge Indian Embassy to find an alternate route for their evacuation. Praying for their safety. #IndiansInUkraine
— sonu sood (@SonuSood) February 24, 2022
మరిన్ని వార్తల కోసం..