కరోనా పరిస్థితుల కారణంగా ఫిలిప్పీన్స్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది. దీనికి సంబంధించి సోనూ సూద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరనుంది.
సోనూసూద్ ఫిలిప్పీన్స్ నుంచి భారతీయులను తీసుకురావడం ఇది రెండోసారి. కొన్నిరోజుల కిందటే మనీలా నుంచి మొదటి విమానం భారత్ చేరుకుంది. దీంతో పాటు కజకిస్థాన్లో చిక్కుకున్న వారి కోసం కూడా సోనూ ఓ విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం కూడా ఆగస్టు 14న బయల్దేరనుంది.
ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్.. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Phase -2
india ➡️ Phillipines.I hope you are ready to be with your families❣️
I have lined up the flight from
Manila to Delhi on 14 Aug at 7:10 pm SG9286.
Can’t wait you to board and get you home.
Have sent you the link❣️?— sonu sood (@SonuSood) August 12, 2020