
- 30 మెఫంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు స్వాధీనం
శంషాబాద్, వెలుగు: డ్రగ్ ఇంజక్షన్లు అమ్ముతున్న ఇద్దరిని శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్ కు చెందిన మహ్మద్ ఆజాజ్(29), మహ్మద్ అక్రమ్(25) వీరిద్దరూ మెఫంటర్మైన్ సల్ఫేట్ డ్రగ్ ఇంజక్షన్లను అమ్ముతున్నారు. ఒక్కో ఇంజక్షన్ ను రూ.200కు కొని బ్లాక్ లో రూ.1,500 నుంచి రూ.2 వేల మధ్యలో అమ్ముతున్నారు.
దీని గురించి సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ వోటీ, రూరల్ పోలీసులు సోమవారం సంఘీగూడ వద్ద వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.2 లక్షల 41 వేల విలువైన 30 మెఫంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెఫంటర్మైన్ ఇంజక్షన్లను వాడితే ఆరోగ్యానికి ప్రమాదకరమని పోలీసులు తెలిపారు.