బెల్ట్ షాపులపై ఎస్ ఓటీ పోలీసుల దాడి

బెల్ట్ షాపులపై ఎస్ ఓటీ పోలీసుల దాడి

జీడిమెట్ల, వెలుగు: సైబరాబాద్​కమిషనరేట్​పరిధిలో బెల్టు షాపులపై ఎస్ ఓటీ పోలీసుల దాడులు చేశారు.  అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పేట్​బషీరాబాద్, బాచుపల్లి, దుండిగల్​, శామీర్​పేట్, మోకీలా, రాజేంద్రనగర్, మైలార్​దేవుపల్లి, నందిగామ, పోలీస్​ స్టేషన్ల పరిధిలోని బెల్ట్ షాపులపై గురువారం పోలీసులు దాడి చేశారు. మొత్తం రూ.7.47 లక్షల విలువైన 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.