బ్రిటన్ స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీ కబునీ, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. క్రీడాకారుల కోసం ఏఐ ఆధారిత కోచింగ్ను భారత్లో ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ప్రతి క్రీడాకారుడికి ప్రొఫెషనల్ స్థాయి శిక్షణ అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ ప్లాట్ఫారమ్ మొబైల్ లేదా ఇతర డివైజ్ల ద్వారా ఆటగాళ్ల కదలికలు, ఆటతీరును విశ్లేషించి రియల్టైమ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్ వంటి ఇతర క్రీడలకూ కబునీ సేవలను వాడుకోవచ్చు.
