సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే చాలా ప్రాంతాలకు స్పెషల్ట్రైన్స్ నడుపుతోంది. తాజాగా కర్ణాటకలోని ఓ ముఖ్య పట్టణానికి స్పెషల్ట్రైన్కూతపెట్టనుందని అధికారులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని అర్సికరే పట్టణానికి.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
టైమింగ్స్ ఇవే..
జులై 20 – 28 మధ్య కాలంలో ట్రైన్ నంబర్ 07231 సికింద్రాబాద్లో రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్సికరేకు అదే రాత్రి 1 గంటలకు చేరుకుంటుంది. మరొకటి (07232) అర్సికరే నుంచి రాత్రి 2 గంటలకు బయల్దేరి ఉదయం 8.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు కాచీగూడ, ఉమ్దానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్, అనంతరపురం, ధర్మవరం, హిందూపురం, ఎలహంక, చిక్బవనూర్, తుమకూరు స్టేషన్లలో ఆగుతాయి. ఈ ట్రైన్లో ఏసీ 2, ఏసీ 3, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలుంటాయి.