సికింద్రాబాద్.. అర్సికరే మధ్య స్పెషల్ ​ట్రైన్.. ఎప్పటినుంచంటే?

సికింద్రాబాద్.. అర్సికరే మధ్య స్పెషల్ ​ట్రైన్.. ఎప్పటినుంచంటే?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే చాలా ప్రాంతాలకు స్పెషల్​ట్రైన్స్​ నడుపుతోంది. తాజాగా కర్ణాటకలోని ఓ ముఖ్య పట్టణానికి స్పెషల్​ట్రైన్​కూతపెట్టనుందని అధికారులు తెలిపారు. 

కర్ణాటక రాష్ట్రం హసన్​ జిల్లాలోని అర్సికరే పట్టణానికి.. సికింద్రాబాద్​ స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 

టైమింగ్స్ ఇవే..

జులై 20 – 28 మధ్య కాలంలో ట్రైన్​ నంబర్​ 07231  సికింద్రాబాద్​లో రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్సికరేకు అదే రాత్రి 1 గంటలకు చేరుకుంటుంది.  మరొకటి (07232) అర్సికరే నుంచి రాత్రి 2 గంటలకు బయల్దేరి ఉదయం 8.30కు సికింద్రాబాద్​ చేరుకుంటుంది. 

ఈ రైళ్లు కాచీగూడ, ఉమ్దానగర్​, షాద్​నగర్​, జడ్చర్ల, మహబూబ్​నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్, అనంతరపురం, ధర్మవరం, హిందూపురం, ఎలహంక, చిక్​బవనూర్, తుమకూరు స్టేషన్లలో ఆగుతాయి. ఈ ట్రైన్​లో ఏసీ 2, ఏసీ 3, స్లీపర్, జనరల్, సెకండ్​ క్లాస్​ బోగీలుంటాయి.