హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శుక్లా మంగళవారం భేటీ అయ్యారు.
రాజ్భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, తెలంగాణలో రైల్వే శాఖ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కొత్త ప్రాజెక్టుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు ప్రణాళికల గురించి గవర్నర్కు తెలియజేశారు.
