- ప్రకటించిన ఎస్సీఆర్
సికింద్రాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య సర్వీసులందించే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మౌలిక వసతుల నిర్వహణ పనుల కారణంగా హైదరా బాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ఈ రోజు నుంచి 10 వరకు 18 రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
అలాగే, మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. కాజీపేట్ - సిర్పూర్టాన్, బల్లా కాజీపేట్, విజయవాడ- భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్- బల్లార్షా వంటి రైళ్లు రద్దైన జాబితాలో ఉన్నాయి.