
చెన్నై: దక్షిణ భారతదేశంలో మొదటి హైస్పీడ్ రైలుకు సోమవారం ట్రయల్ రన్ మొదలైంది. చెన్నై–మైసూరు మధ్య వందే భారత్ఎక్స్ప్రెస్ పరుగులు తీసింది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. దక్షిణ భారతంలో మొట్టమొదటి, దేశంలో ఐదో హైస్పీడ్ రైలుగా దీనికి గుర్తింపు దక్కనుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లలో తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ‘మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చారు. అయితే, 2021 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం నలుమూలలనూ కలిపేందుకు 75 వారాలలో 75 వందే భారత్ రైళ్లను తీసుకొస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.