బైక్ దొంగలు ఐదుగురు అరెస్ట్

బైక్ దొంగలు ఐదుగురు అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: బైక్ లను దొంగిలిస్తున్న ఐదుగురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అమన్ నగర్ కు చెందిన  మహ్మద్ రయీస్ అలియాస్ ఇర్ఫాన్ (28) ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. యాకత్ పురాకు చెందిన ఇమ్రాన్ (31) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు.

ఈ ఇద్దరకూ మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ శాక్యుద్దీన్ (24), కిషన్ బాగ్ కు చెందిన ఆదాన్, సయ్యద్ అబ్దుల్ తో కలిసి బైక్ చోరీలకు స్కెచ్ వేశారు. పార్కింగ్ లో ఉన్న బైక్ లను కొట్టేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారు. బాధితుల కంప్లయింట్లతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిపై నిఘాపెట్టి శుక్రవారం అదుపులోకి తీసుకుని గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 9 బైక్ లు , సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలించినట్లు గుడిమల్కాపూర్ పోలీసులు తెలిపారు.