
- సర్క్యూలర్ జారీ చేసిన సదరన్ డిస్కం
హైదరాబాద్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతతో సబ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సదరన్ డిస్కం కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. సబ్స్టేషన్ల ఏర్పాటుకు పట్టణాల్లో కొత్తగా నిర్మించే మల్టీ స్టోర్డ్ బిల్డింగులు, లేఅవుట్లలో స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. స్థలాల కొరతతో ఈ నిర్ణయం తీసుకున్నమంది. ఈ సర్క్యూలర్ ప్రకారం..500 ఇండ్లతో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ నిర్మించే సంస్థలు..2500 కిలోవాట్లకు పైగా లోడ్ ఉండే విద్యుత్ సరఫరా చేసేందుకు 800 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి. అదే విధంగా..35 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఓపెన్ ప్లాట్ లేఅవుట్లు, అంతే విస్తీర్ణంలో నిర్మించే గేటెడ్కమ్యూటీ విల్లాలకు కరెంటు సరఫరా కోసం 1500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి. లీగల్ కేటాయింపులు చేసి స్థలాన్ని డిస్కంకు హ్యాండోవర్ చేస్తే ఆ స్థలంలో 13కేవీ 11కేవీ సబ్ స్టేషన్లను నిర్మిస్తారు.