ఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌లో 201 సబ్‌‌‌‌ ఇంజినీర్లు

ఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌లో 201 సబ్‌‌‌‌ ఇంజినీర్లు

హైదరాబాద్‌‌‌‌లోని సదరన్‌‌‌‌ పవర్‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ కంపెనీ ఆఫ్‌‌‌‌ తెలంగాణ లిమిటెడ్‌‌‌‌ (టీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌) సబ్​ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. ఆన్​లైన్​లో జులై 5వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. 

అర్హత: మొత్తం 201 ఉద్యోగాలకు డిప్లొమా (ఎలక్ట్రికల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌)/ డిప్లొమా (ఎలక్ట్రికల్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్‌‌‌‌/ ఎలక్ట్రికల్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఎగ్జామ్​ ఆబ్జెక్టివ్​ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్‌‌‌‌ ఏ లో మొత్తం 80 ప్రశ్నలు టెక్నికల్‌‌‌‌ సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్‌‌‌‌ బి నుంచి 20 ప్రశ్నలు, జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌, న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ఉంటాయి. పరీక్షను రెండు గంటలు నిర్వహిస్తారు.

అప్లికేషన్​ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో జులై 5 వరకు అప్లై చేసుకోవచ్చు.  అప్లికేషన్​ ఫీజు 200 చెల్లించాలి. జులై 31న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.tssouthernpower.com వెబ్​సైట్​ సంప్రదించాలి.