హనుమాన్​ జయంతి శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ బాలస్వామి

హనుమాన్​ జయంతి శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ బాలస్వామి

మెదక్​టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి, శోభాయాత్రలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ బాలస్వామి సూచించారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను కించపర్చరాదన్నారు. అభ్యంతరకరమైన పోస్టులు, సోషల్​ మీడియాల్లో  ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాలీ సమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తుంటామన్నారు.