మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం తన ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, వైవాహిక, కుటుంబ, డ్రంకన్డ్రైవ్, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.
న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి కక్షిదారులకు కౌన్సెలింగ్ఇవ్వాలన్నారు.
