డయల్ 100 కాల్స్ కు స్పందించండి : ఎస్పీ రాజేశ్చంద్ర

డయల్ 100 కాల్స్ కు స్పందించండి  : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : అత్యవసర పరిస్థితుల్లో వచ్చే డయల్ 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని,  ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎస్పీ రాజేశ్​చంద్ర పోలీస్​ సిబ్బందికి సూచించారు. మంగళవారం దేవునిపల్లి పోలీస్​ స్టేషన్​ను ఎస్పీ తనిఖీ చేశారు.  స్టేషన్​ పరిసరాలు,  రిసెప్షన్​ సెంటర్, రికార్డులను పరిశీలించి మాట్లాడారు. 

 ప్రజల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలన్నారు. పెండింగ్​ కేసులు పరిష్కరించాలని,  సైబర్​ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ చైతన్యారెడ్డి, రూరల్ సీఐ రామన్​,  ఎస్సై రంజిత్​ ఉన్నారు.  

143 సెల్​ఫోన్లు రికవరీ.. 

కామారెడ్డి జిల్లాలో రూ.23 లక్షల విలువైన 143 సెల్​ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు. సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా ఫోన్లను రికవరీ చేశామన్నారు.  సెల్​ఫోన్ పోయినా, చోరీకి గురైనా వెంటనే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 75 లక్షల విలువైన 1,722  సెల్​ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్సై బాల్​రాజు, 
సిబ్బంది ఉన్నారు.