
- ఎస్పీ రాజేశ్చంద్ర
పిట్లం, వెలుగు : పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా విధులు నిర్వహించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మంగళవారం పెద్దకొడప్గల్ పోలీస్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. రిసెప్షనిస్టు, స్టేషన్ రైటర్, టెక్టీమ్, మెన్రెస్ట్రూం, లాకప్రూం స్టేషన్ పరిసరాలు పరిశీలించి మాట్లాడారు. బాధితులను న్యాయం జరిగేలా కేసులు దర్యాప్తు చేయాలన్నారు. డయల్ 100 కు వెంటనే స్పందించాలన్నారు. నేరాల అదుపునకు ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విస్తృతంగా డంక్ అండ్ డ్రైవ్ చేపట్టి ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ మోసాలు, మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఎస్పీ వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, బిచ్కుంద సీఐ నరేశ్, ఎస్సై మోహన్రెడ్డి ఉన్నారు.
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
ఎల్లారెడ్డి, వెలుగు : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును సమీక్షించారు.