మీడియా పారదర్శకంగా ఉండాలి : రక్షిత కె మూర్తి

మీడియా పారదర్శకంగా ఉండాలి : రక్షిత కె మూర్తి

వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని ఎస్పీ రక్షిత కె మూర్తి కోరారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎలక్షన్​ కోడ్​ ఉల్లంఘిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు సి విజిల్  యాప్ అందుబాటులో ఉందని ఎస్పీ చెప్పారు.టోల్​ఫ్రీ నెంబర్​1950, లేదా గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీడియా సహకరించాలని కోరారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.