వంశీ ఎక్కడైన కూర్చోవచ్చు : స్పీకర్ తమ్మినేని

వంశీ ఎక్కడైన కూర్చోవచ్చు : స్పీకర్ తమ్మినేని

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే జగన్ ను కలిశానని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. జగన్  ను కలిసిన తర్వాత టీడీపీ తనపై తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. టీడీపీ సస్పెండ్ చేసిందని, నియోజకవర్గ ప్రజల కోసం తాను అసెంబ్లీలో ఉండాలన్నారు. తనని ప్రత్యేక సభ్యుడి గుర్తించాలని స్పీకర్ ను  కోరారు.

వంశీ ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చన్నారు స్పీకర్ తమ్మినేని. అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకి సీటు కేటాయిస్తామని తెలిపారు. అసెంబ్లీ వైసీసీ ఆఫీస్  అన్న టీడీపీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. అసెంబ్లీ ప్రజల ఆలయమని ఎవరి జాగీరు కాదన్నారు, స్పీకర్ గా తనకు వున్న అధికారాలతోనే వంశీకి మాట్లాడే అవకాశమిచ్చానని తెలిపారు.