హైదరాబాద్, వెలుగు: టీఎస్ఆర్టీసీ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 5 రోజుల పాటు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్మ్యాచ్కు ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేకంగా 60 బస్సులను నడపనుంది.
ఉదయం 8 గంటల నుంచి స్టేడియానికి, తిరిగి స్టేడియం నుంచి రాత్రి 7 గంటలకు ఇతర ప్రాంతాలకు బయలుదేరతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ కోరుతోంది.