టెస్ట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి స్పెషల్ బస్సులు

 టెస్ట్ మ్యాచ్ కోసం ఉప్పల్  స్టేడియానికి స్పెషల్ బస్సులు

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ఆర్టీసీ క్రికెట్ అభిమానులకు గుడ్ ​న్యూస్ ​చెప్పింది. నేటి నుంచి 5 రోజుల పాటు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్​మ్యాచ్​కు ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్​ స్టేడియానికి ప్రత్యేకంగా 60 బస్సులను నడపనుంది.

ఉదయం 8 గంటల నుంచి స్టేడియానికి, తిరిగి స్టేడియం నుంచి రాత్రి 7 గంటలకు ఇతర ప్రాంతాలకు బయలుదేరతాయి. ఈ ప్రత్యేక బ‌‌‌‌‌‌‌‌స్సుల‌‌‌‌‌‌‌‌ను  వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌‌‌‌‌‌‌‌ని క్రికెట్ అభిమానుల‌‌‌‌‌‌‌‌ను టీఎస్ఆర్టీసీ కోరుతోంది.