- బీఎండబ్ల్యూ ఎక్స్7 ఎం50డీ స్పెషల్ ఎడిషన్@ రూ.2.02 కోట్లు
యూరోపియన్ లగ్జరీ వెహికల్ మేకర్ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం దేశంలో ఎక్స్ 7 ఎం50డీ 'డార్క్ షాడో' ఎడిషన్ కారును లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్–షోరూమ్ ధర రూ. 2.02 కోట్లని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో 2,993 సిసి డీజిల్ ఇంజిన్ ఉంటుంది. కారు కేవలం 5.4 సెకన్లలో -100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 8 -స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ను అమర్చారు. భద్రత, సౌకర్యం కోసం ఎన్నో ఫీచర్లు ఉన్నాయని బీఎండబ్ల్యూ తెలిపింది.