
ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టులతో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే నలభై ఐదు రోజులపాటు షూటింగ్ కూడా పూర్తయింది. కొత్త షెడ్యూల్ను హైదరాబాద్లో ప్రారంభించనున్నారట. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోలో 19వ శతాబ్దానికి చెందిన సెట్ను వేశారట. దాదాపు పదిరోజులకు పైగా ఈ షెడ్యూల్ జరగనుందని, ప్రభాస్తో పాటు ముఖ్య పాత్రధారులంతా షూటింగ్లో జాయిన్ కానున్నారట.
ఈ చిత్రం కామెడీతో కూడిన హారర్ థ్రిల్లర్గా ‘రాజా డీలక్స్’ టైటిల్తో తెరకెక్కుతోందని సమాచారం. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు దేన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. షూటింగ్ జరుగుతున్న ట్టు మాత్రం నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. ఈ ఏడాది చివర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న, ‘సాలార్’ సెప్టెంబర్ 28న, ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే యేడు జనవరి 12న విడుదల కానున్నాయి.