వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్పులు.. SI మృతి

వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్పులు.. SI మృతి

తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో దారుణం జరిగింది.  వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.   ఈ కాల్పుల్లో ఎస్ఐ విల్సన్‌ మృతి చెందారు. కేరళ బార్డర్ లోని చెక్ పోస్టు వద్ద బుధవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగింది.  తిరువనంతపురం నుంచి నాగర్‌కోయిల్ వైపు వస్తున్న(TN 57 AW 1559,) కారును తనిఖీ చేస్తుండగా  ఇద్దరు వ్యక్తులు కారు దిగి ఎస్ఐపై కాల్పులు జరిపారు.  తర్వాత కేరళ సరిహద్దు వైపు పారిపోయారు. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు గుర్తించారు.  విల్సన్ ను ఆస్పత్రిగా తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. మృతి చెందిన ఎస్ఐ విల్సన్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.