మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు

మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు

ప్రముఖ గిరిజన జాతర మేడారంకు దక్షిణమధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది. జాతరకు వెళ్లే భక్తులకు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా… మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు రెడీ అయ్యింది.

ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌- వరంగల్‌ వరకు 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటు ఉంటాయన్నారు. అవి మౌలాలీ, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ, రఘునాథ్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. మరోవైపు మరో 10 రైళ్లు సిర్పూర్‌ కాగజ్‌నగర్- వరంగల్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడవనున్నాయి. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, జమ్మికుంట, కొత్తపల్లి, కొలనూర్ స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని తెలిపారు అధికారులు.