
ముంబై: బడ్జెట్ క్యారియర్ స్పైస్జెట్ నికర లాభం (స్టాండెలోన్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 324.87 కోట్లకు చేరుకుంది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ విమానయాన సంస్థ 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.119 కోట్ల నికర లాభం నమోదు చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఈ క్వార్టర్లో కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16 శాతం తగ్గి రూ.1,446.37 కోట్లకు చేరుకుందని స్పైస్జెట్ తెలిపింది.
2024–-25 ఆర్థిక సంవత్సరానికి, స్పైస్జెట్ రూ.58 కోట్ల నికర లాభం సాధించింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.409 కోట్ల నష్టం చవిచూసింది. గత ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా యాన్యువల్ బేసిస్లో ప్రాఫిట్ నమోదు చేసింది. కంపెనీ రెవెన్యూ మాత్రం 25 శాతం తగ్గి రూ.7,050 కోట్ల నుంచి రూ.5,284 కోట్లకు పడింది.