
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్ పాలు పోసి పెంచిన ఉగ్రవాదులను, వారి స్థావరాలను ఏకకాలంలో దాడిచేయటంతో ప్రతి భారతీయ పౌరుడిలో ఆ గర్వం నిండిపోయింది. భారత ఆర్మీ నిరంతరం దేశాన్ని కాపాడేందుకు చేపడుతున్న చర్యలు, వారు చేస్తున్న త్యాగాలు కోట్ల మంది భారతీయులను కదిలించాయి. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువులు సైతం దేశభక్తిని ప్రజల్లో పెంపొందిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాంభద్రాచార్య భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీని పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్ ను వెనక్కి తీసుకురావాలని కోరారు. మధ్యప్రదేశ్ చిత్రకోట్ లోని తన ఆశ్రమానికి ద్వివేది వచ్చిన సందర్భంలో ఈ స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెనక్కి తీసుకురావటాన్ని తనకు గురుదక్షిణగా రాంభద్రాచార్య కోరారు.
Also Read : మావోయిస్ట్ పార్టీకి మరో భారీ షాక్
వాస్తవానికి పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక భారతీయ పౌరులు మరణించిన తర్వాత రాంభద్రాచార్య రిక్వెస్ట్ వచ్చింది. ఆయన వ్యాఖ్యలు చూసిన వారు ఆధ్యాత్మికత అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు.. దేశభక్తి, దేశ రక్షణ వంటి అంశాలు కూడా ప్రజలకు బోధించాలని అంటున్నారు.
ఇదే క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారతదేశానికి చెందిన్న ఆయన.. భౌగోళికంగా విడిపోయినప్పటికీ అక్కడి ప్రజలు రాజకీయంగా ఏదో ఒకరోజు భారత్లో ఏకమౌతారన్నారు. అయితే ఆ రోజుకు ఎంతో దూరం లేదని చెప్పారు. పీవోకే దానంతట అదే తిరిగి భారతదేశంలోకి వస్తుందని, అక్కడి ప్రజలు ఇండియాతో బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. దీనిని సాధించటానికి శక్తితో పాటు కొంత సంయమనం కూడా అవసరమని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు.