
ఖమ్మం: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాలోని వేంసూర్ మండలం కందుకూరులో వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కబడ్టీ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. కాగా.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్యర్యంలో ఎండ్ల బండి పోటీలు నిర్వహంచారు. అనంతరం ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.