
హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ ఎక్స్పో ఇండియా–2025 ఎనిమిదో ఎడిషన్ను ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తామని హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ ప్రకటించారు. ఈసారి ఎక్స్పోలో ఈ-స్పోర్ట్స్ ఎక్స్ పేరుతో ప్రత్యేక పెవిలియన్ను ప్రారంభించనున్నారు. ఇది ఈ-–స్పోర్ట్స్, గేమింగ్, టెక్నాలజీ ఆధారిత ఆటల కోసం ఉపయోగపడుతుంది.
ఎక్స్పోలో 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఎంట్రీ ఉచితమే! ఎక్స్పోకు 40 వేల మంది వస్తారని అంచనా. అన్ని వయసుల వారికి అనువైన ఆరు క్రీడా కార్యకలాపాలు ఉంటాయి. ఈ సందర్భంగా కేలిస్తెనిక్స్ ప్రదర్శనలు, ఎంఎంఏ, బాక్సింగ్ ప్రదర్శనలు, హైడ్రాక్స్ ఫిట్నెస్ చాలెంజ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి.