కొత్తపల్లి, వెలుగు: క్రీడలతో విద్యార్థుల్లో ఒత్తిడి దూరమవుతుందని అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో బుధవారం ఖేల్ కీ జోష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతారన్నారు.
దీనిలో భాగంగా విద్యార్థులకు ఫుట్బాల్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, స్కిప్పింగ్, చెస్, క్యారమ్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు రేకుర్తి విజన్ హైస్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవానికి నరేందర్రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణతో చదివితేనే ఉజ్వల భవిష్కత్ ఉంటుందన్నారు. విద్యార్థులు చేసిన కల్చరల్ ప్రోగ్సామ్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కరస్పాండెంట్ ప్రసాద్, డైరెక్టర్ వెంకట్, హెచ్ఎం రాజిరెడ్డి, పాల్గొన్నారు.
