
చెన్నై: టాప్ ర్యాంక్ ఈజిప్ట్ జట్టు స్క్వాష్ వరల్డ్ కప్లో చాంపియన్గా నిలిచింది. చెన్నైలో శనివారం జరిగిన ఫైనల్లో ఈజిప్ట్ 2–1తో నాలుగో సీడ్ మలేసియాను ఓడించి కప్పు సొంతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన తుదిపోరులో తొలి సింగిల్స్లో మలేసియా ప్లేయర్ జిన్ యింగ్ 7–4, 7–5, 7–6తో ఈజిప్ట్ ప్లేయర్ కెంజీని ఓడించి జట్టుకు ఆధిక్యం అందించాడు. కానీ, తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఈజిప్ట్ ఆటగాళ్లు ప్రత్యర్థులను ఓడించి తమ జట్టును విజేతగా నిలిపారు.